దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై దివ్యాంగ పెన్షన్ను నగదు రూపంలో కాకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధానాంశాలు:
ప్రస్తుతం చాలా మంది దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా పెన్షన్ తీసుకోవడానికి పాఠశాలలకు సెలవు పెట్టి స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.
దీనివల్ల వారి చదువుకు అంతరాయం కలగడంతో పాటు ప్రయాణ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి.
ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దీంతో రెండు నుంచి మూడు నెలల్లో దివ్యాంగ విద్యార్థుల పెన్షన్ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా పెన్షన్ కోసం పాఠశాలకు సెలవు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి