కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
జులై 26, 2026 మల్లెల న్యూస్
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, ఆ శాఖకు తాత్కాలిక బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. వీటితో పాటు విద్యాశాఖను కూడా అదనపు బాధ్యతగా ఆయనకు కేటాయించారు.
ఇదిలా ఉండగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి