కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అభినందనలు
చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ను అధినేత, గౌరవనీయులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శ్రీ మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా నూతనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఎన్నికైన బాలు నాయక్, వైస్ ప్రెసిడెంట్ శివ సాయిరాం, జనరల్ సెక్రెటరీ షైక్ జానీబాషా , అప్పారావు, ఉపాధ్యక్షులు శామ్యూల్, కార్యదర్శి వెంకట్, జనరల్ సెక్రెటరీ ప్రసాద్ నాయక్, ఎక్సక్యూటివ్ మెంబర్ నాగెండ్ల కోటేశ్వరరావుతో పాటు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్సీ శ్రీ మర్రి రాజశేఖర్ అభినందనలు తెలిపారు.
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, జర్నలిస్టుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చప్పిడి బాలస్వామి, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ రిజిస్టర్ నెంబర్: 183/2019
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి