పూర్వము తాళికి పసుపుకొమ్ము ఎందుకు జత చేసేవారు...??
పసుపు కి మన సంప్రదాయాలలో విశిష్ట స్థానముంది,పవిత్రతకు చిహ్నము అని మనకందరికీ తెలిసిందే
పసుపులో కర్క్యుమిన్ అనే రసాయనము ఉండడం వల్ల ఇది ఆరోగ్యపైన కూడా మంచి ప్రభావాన్ని చూపి మానవాళికి ఎంతో మేలు చేసేది అందుకే ఆడవారి హృదయస్థానాన్ని నిత్యం తాకేలా పసుపుకొమ్మును తాళికి జతచేశారు మన పూర్వీకులు
పసుపు చాలా ప్రభావంతమైన ఏంటీ బేక్టీరియల్,ఏంటీ ఇన్ ఫ్లమేటరీ
కూడా,ప్రేగుల్లోని మలినాలను శుద్దిచేసే గుణకారిణి
నొప్పులనూ హరించగల దివ్య ఔషదమని ఏనాడో మన ప్రాచీన ఆయుర్వేద పండితులు పసుపును విరివిగా వాడమని సూచించారు
పూర్వము పాము పుట్రా ఇంటిలోకి చేరకుండా కూడా పసుపుని మన గడపలకి రాసే సాంప్రదాయాన్ని పెద్దలు సూచించారు
అందుకే ఆడవారికి ఇన్ ఫెక్షన్లు సోకి కేన్ సర్ బారిన పడకుండా పసుపుకొమ్మును తాళికి జతచేశారు పసుపులోని ఔషద గుణాలను నేటి ఆధునిక సైన్స్ కూడా దృవీకరించింది
చూశారా బ్రదర్స్/సిష్టర్స్ ఎంత గొప్పవి మన సాంప్రదాయాలు మన దేశములో మన జననం జరగడం పూర్వ జన్మ సుకృతం కాదంటారా..
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి